కుప్పం జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల ఆత్మీయ సమావేశం

చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హారిప్రసాద్ అధ్యక్షతన కుప్పం ఇంచార్జ్ వెంకటరమణ పర్యవేక్షణలో కుప్పం నందు జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల ఆత్మీయ సమావేశం నందు జిల్లా అధ్యక్షులు మండల కమిటీ సభ్యుల యెక్క బాధ్యతలు, జనసైనికులతో కలిసి గట్టుగా ఎలా పని చేయాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, త్వరలో ప్రారంభమయ్యే మలి విడత క్రియాశీలక సభ్యత్వం గురించి పార్టీ శ్రేణుల్లో అవగాహన కల్పించి, క్రియాశీలక సభ్యత్వం యొక్క ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ గారితో పాటు, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సుభాషిని, జిల్లా ఉపాధ్యక్షులు మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, జిల్లా కార్యదర్శులు దేవర మనోహర్ రామమూర్తి, సంయుక్త కార్యదర్శులు వేణు, మునెప్ప మరియు మండల అధ్యక్షులు సుధాకర్, ప్రవీణ్, హరీష్, కిషోర్ మరియు అమీర్, మహిళా విభాగం కుసుమా గారు, చిరంజీవి యువత అధ్యక్షులు నవీన్ లతో పాటు మండల కమిటీ సభ్యులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.