విఆర్ఎ ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన జనసేన

కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలీ మండల విఆర్ఎ ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ మండల నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జగన్ రెడ్డి విఆర్ఎ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అలా కాని పక్షంలో జనసేన పార్టీ తరపున ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఉద్యోగులు కొరుకునేది వారికి రావాల్సిన జీతాలు, వారు చేస్తున్న ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని కోరుతున్నారు మీరు ఇచ్చిన హామిని మీరే తుంగలో తొక్కుతున్నారు దయచేసి వారి డిమాండ్లను పరిష్కరించాలని జనసేన పార్టీ తరపున ముఖ్యమంత్రిని కోరడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు మధు నాయుడు, సునీల్, చంద్ర, రమేష్, హర్ష తదితరులు పాల్గొన్నారు.