జనసేన నగర కార్యదర్శిగా కప్పల సూర్యప్రకాష్

*నగర జనసేన కార్యవర్గంలో సీనియర్స్ కు సముచిత స్ధానం

తూర్పుగోదావరి, జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఇటీవల ప్రకటించిన నగర కమిటీలో కార్యదర్శి పార్టీ సీనియర్ నేత కప్పల సూర్యప్రకాష్ నియమితులైయ్యారు. మెగా కుటుంబానికి సన్నిహితులుగా, జనసేన పార్టీ స్ధాపన నుంచి కష్టపడుతూ, నిస్వార్ద సేవలందిస్తున్న సూర్యప్రకాష్ కు పదవి దక్కటంతో, రాష్ర్ట, జిల్లా, నగర జనసేన నేతలు, జనసైనికులు, వీరమహిళలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ… నగర కమిటీలో తనకు భాధ్యాతాయుతమైన పదవి కల్పించటం ఆనందంగా ఉందని, అందరినీ కలుపుకుంటూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, పార్టీ సిధ్ధాంతాలకు లోబడి, కులమతాలకు అతీతంగా, నిజాయితీగా పనిచేస్తూ నగరంలో జనసేన పార్టీకి మరింత బలం చేకూర్చేలా పనిచేస్తానని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నగరంలో పార్టీ విజయకేతనం ఎగరేసేలా కష్టపడతామని సూర్యప్రకాష్ తెలియజేసారు. తనకు ఈ అవకాసం కల్ఫించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, చైర్మన్ నాదెండ్ల మనోహర్, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, నగర అధ్యక్షులు వై. శ్రీనివాస్, రాజమండ్రి నగర ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలియజేసారు.