యూఏఈ లో ఘనంగా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభం

యూఏఈ, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా 15.02.2022 మంగళవారం యూఏఈ లోని (ఫుజర) ఒక చర్చి ప్రార్థనా స్థలంలో జనసేన పార్టీ ఆఫీసుని చంద్ర శేఖర్ మరియు జాన్ బాబు పెనుమల ల అద్వర్యంలో చాలా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ గొప్ప ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా అప్పాజి, అప్పారావు మరియు యూఏఈ జనసైనికులతో పాటు దుబాయ్ పవనిజం సేవా సమితి సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న అందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు ఇక్కడ నుంచి కొనసాగిస్తూ జనసేన బలోపేతానికి యూఏఈ జనసైనికులు అందరూ కృషి చెయ్యాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో, అబుదాబి జనసేన కో-ఆర్డినేటర్ నారాయణ, దుబాయ్ గల్ఫ్ సేన జనసేన ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.