గిరిజనులు పండించిన మిరియాలుకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వాలని జనసేన డిమాండ్

*జనసేన ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా

అరకు వేలి మండలం, ఇరిగాయి పంచాయతీ పరిధిలో గల కుందిగూడా గ్రామంలో జనసేన పార్టీ ఎక్స్ ఎంపీటీసీ సాయిబాబా ఆధ్వర్యంలో గురువారం ఉదయాన జనసేన బృందం ఆయా గ్రామంలో పర్యటించారు. ముందుగా గ్రామస్తులతో సమావేశమై ఇంటింటికి జనసేన మాటలు తీసుకెళ్తూ, ఈ సందర్భంగానే గిరిజనులు పండించిన మిరియాలును పరిశీలించారు. అనంతరం జనసేన ఎక్స్ ఎంపీటీసీ సాయిబాబా మాట్లాడుతూ గిరిజనులు ఎంతో కష్టపడి పండించిన మిరియాలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం చాలా బాధాకరమైన విషయమని, ప్రభుత్వం స్పందిస్తూ గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్యాంసుందర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.