నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరికలు

ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంకల్పించిన మత్యకార కుటుంబాల సమస్యలు తెలుసుకునేందుకు అయిన పర్యటనలో భాగంగా ప్రియతమ నాయకులు పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, పిఎసి సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం, పెదపూడి, గ్రామాల్లో, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలకి అనేక మంది యువత అకర్షితులు అయ్యి పార్టీలో చేరడం జరిగింది. వారికి ఘనంగా పార్టీ కండువా కప్పి స్వాగతించారు. పెద్దలు నాదెండ్ల మనోహర్ అలాగే జనసైనికులకి దిశానిర్దేశం, పార్టీ విధివిధానాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర శ్రీరాములు, దొడ్డిపట్ల అప్పారావు, సూతి శ్రీనివాసరావు, సిహెచ్.అనిల్ కుమార్, నగేష్, శ్రీను, బి.వీరబాబు, వాసు, సతీష్, విక్రమ్ కుమార్, వీరబాబు, జనసేన పార్టీవివిధ నియోజకవర్గ నాయకులు, జనసేన పార్టీ వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.