సభ్యత్వ కార్యక్రమంలో ప్రధమ స్థానం రావడానికి కృషి చేయాలి: గుండా రామకృష్ణ

జనసేన పార్టీ సభ్యత్వం కార్యక్రమంలో వీరవాసరం మండలం, రాష్ట్రంలో ప్రధమ స్థానం పొందడానికి కృషి చేయాలని వీరవాసరంలో గుండా రామకృష్ణ అధ్యక్షతన జరిగిన మండల జనసేన సమావేశంలో తీర్మానించింది. 19వ తేది శనివారం మత్స్యపురిలో గృహ ప్రారంభంకు విచ్చేస్తున్న పి.ఏ.సి. చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటన జయప్రదం చేయాలని నర్సాపురం పవన్ కళ్యాణ్ బహిరంగ సభను జయప్రదం చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భముగా గుండా రామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ మరింత బలోపేతం చేయాలన్నారు. మండలంలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాలన్నారు. ఈ కార్యక్రమం.పి.టి.సి. గుండా జయప్రకాష్నాయుడు, వైస్ ఎం.పి.పి. అడ్డాల రాము, చిలకపాటి రాము, జడ్డు బాబి, మాజీ యం.పి.పి.మోపిదేవి విశేశ్వరరావు, వేండ్ర లీలాకృష్ణ, గుండా బాబు, యం.పి.టి.సి లు వాసాల వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి యాళ్ళబండి ఇందిర, పెంటకోటి సూర్యప్రకాశరావు, కె. గిరిష్, కామిశెట్టి హేమంత్, అడబాల శేఖర్, ముఖమట్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గోన్నారు.