కంచికచర్లలో మలివిడత క్రియాశీల కార్యక్రమం ప్రారంభం

నందిగామ, మలివిడత క్రియాశీల కార్యక్రమం నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సూచన మేరకు కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మండల అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ… భారత దేశంలో మొట్టమొదటిగా కార్యకర్తల కోసం ఆలోచించిన ఏకైక పార్టీ జనసేన అన్నారు. కొఠారు దేవేంద్ర, కుర్రా నాని, తోట ఓంకార్, ఎలక దుర్గాప్రసాద్, పుప్పాల వేణుగోపాల్, కంచేటి సాయిబాబా, సాయి హేమంత్, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.