ప్రతి ఒక్క జనసైనికుడు క్రియాశీలక సభ్యత్వం చేయించుకోవాలి: బొబ్బేపల్లి సురేష్
సర్వేపల్లి, జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు బాగు కోసం క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో మంగళవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల బాగు కోసం ఏర్పాటు చేయని విధానాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం రెండో దశ ప్రారంభం చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తకు జీవిత భీమా సౌకర్యం లభిస్తుంది అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యి గాయాల పాలయితే 10 వేల నుంచి 50 వేల రూపాయల వరకు మరియు మరణిస్తే ఐదు లక్షల వరకు జీవిత భీమా జనసేన పార్టీ అందిస్తుంది. ఈ అవకాశాన్ని జనసేన పార్టీ కోసం కష్ట పడిన ప్రతి ఒక్క జనసైనికుడు ఉపయోగించుకోవాలని క్రియాశీలక సభ్యత్వం చేయించుకోవాలని బొబ్బేపల్లి సురేష్ బాబు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో రవికుమార్, సందీప్, శ్రీహరి, వీరబాబు, దయాకర్, శ్రీను, వంశీ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-22-at-2.28.43-PM-1024x576.jpeg)