మార్కాపురం జిల్లా సాధనకై జనసేన ఆధ్వర్యంలో మహిళా సోదరీమణులతో కాగడాల ర్యాలి

మార్కాపురం జిల్లా సాధన సమితి(జే.ఏ.సి) ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో అధిక సంఖ్యలో మహిళలు కాగడాల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జేఏసీ వైస్ చైర్మన్ మరియు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ మార్కాపురం జిల్లా సాధనకై మేము సైతం అంటూ కాగడాల ర్యాలీకి వచ్చిన మహిళా సోదరీమణులకు అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ర్యాలీలో జేఏసీ చైర్మన్ మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జే.ఏ.సి కన్వీనర్ సైదా, ట్రెజరర్ వక్కలగడ్డ మల్లికార్జున, సిపిఐ నాయకులు అందే నాసరయ్య, జనసేన వీరమహిళలు లక్ష్మీ రాజ్యం, లక్ష్మీ, భారతి, అరుణ, రాజ్య లక్ష్మీ, మహాలక్ష్మీ, నీరజ, సువర్ణ, భవాని, జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం పట్టణ అధ్యక్షులు ఇమామ్ సాహెబ్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, పిన్నెబోయున శ్రీనివాసులు, రవి, మధు, జానకి రామ్, వెంకట్, వీరిశెట్టి శ్రీను మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.