ఎన్ని కుట్రలు చేసినా అద్భుత విజయం అందుకోబోతున్న భీమ్లా నాయక్: బండారు శ్రీనివాస్

*జనసేనాని పై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అద్భుత విజయం అందుకోబోతున్న భీమ్లా నాయక్.. రాబోయే కాలానికి అతడే లెజెండ్ నాయకుడు: బండారు శ్రీనివాస్ జనసేన ఇన్చార్జ్

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనసేనాని పై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. నిజాయితీపరుడు, మనసున్న మారాజు, రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చడానికి తన బంగారు భవిష్యత్తును పణంగా పెట్టి ప్రజా సమస్యలపై పోరాటానికి నిరంతరం ముందుoడే రాష్ట్ర జన సైనికుడు, ప్రజా నాయకుడూ అతడే. జనసేనాని పవన్ కళ్యాణ్ ముందు ఎవరైనా రాబోయే రోజుల్లో తలవంచక తప్పదని, అధికార దాహం కొంతమందికి కొన్నాళ్ళు ఉంటుందని, ఎల్లకాలము నిలబడదని, ప్రజలు తలుచుకుంటే, అధికారమధముతో ఉన్న నాయకులను కాలగర్భంలో కలిపే రోజు తప్పకుండా వస్తుందని, తెలుగు రాష్ట్రాలు, తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ప్రముఖ ప్రసిద్ధి గాంచిన సినీ కళాకారుడు, నాయకుడు జనసేనానిని ఎంతకాలం అడ్డుకోగలరని, ఏనాటికైనా నీతి నిజాయితీయే గెలుస్తుందని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగోగులను చూడగలిగే ప్రజా నాయకుడు, సేవాతత్పరుడు, అన్ని వర్గాలను సమానంగా ఆదరించే గొప్ప నాయకుడి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల్లో మార్పు మొదలైందని, ఇక ఆపడం ఎవరి తరం కాదని, ఆంధ్ర రాష్ట్రానికి జనసేనానే అసలు సిసలైన నాయకుడు కాబోతున్నాడని, రేపు విడుదల కాబోతున్న భీమ్లా నాయక్ సినిమా అద్భుత విజయాన్ని అందుకోబోతున్నదని, ప్రతి ఒక్కరూ జనసేనానిని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని, ఆదరిస్తారని ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తూ.. ముందుగా జనసేనాని పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు, జనసేనానికి, చిత్రపరిశ్రమ యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ జనసేన పార్టీలో క్రియాశీల సభ్యత్వములను తీసుకొని, వారి కుటుంబాలకు భీమా రక్షణ ప్రయోజనం పొందాలని, ఏ ఒక్క కార్యకర్త ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగినా, గాయాలపాలైనా, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిన ఆ కుటుంబం ఎప్పుడు ఇబ్బందులు పడకూడదనే ఒక మంచి ఆలోచనతో, సామాన్య కార్యకర్తలకు జన సైనికులకు న్యాయం జరగాలని ఎంతో పెద్ద మనసుతో ఒక ఇన్సూరెన్స్ పథకము ద్వారా ఐదు లక్షలు, గాయాలపాలైన వారికి 50 వేల రూపాయలు పథకాన్ని అందించేలా కార్యకర్తలకు అండగా ప్రవేశపెట్టారు. జనసేనాని ఒక గొప్ప మనసున్న నేత అని బండారు శ్రీనివాస్ ఈ సందర్భంగా కొనియాడారు. కార్యకర్తల కోసం ఇలాంటి పథకము దేశ చరిత్రలో ఎవరూ కూడా ప్రవేశపెట్టలేదని, అధికారం లేకపోయినా కార్యకర్తలే ప్రాణంగా నమ్మే నిజమైన నాయకుడు ఒక జనసేనాని మాత్రమేనని, గత రెండు రోజుల నుంచి క్రియాశీల సభ్యత్వాలు ప్రారంభమయ్యాయని, ఈ సంవత్సరమునకు కొత్తగా ప్రతి ఒక్కరు 500 రూపాయలు చెల్లించి క్రియాశీల సభ్యత్వాలను త్వరగా నమోదు చేయించుకోవాలని వారి కుటుంబాలకు అండగా ఈ పథకములో భాగస్వాములు కావాలని బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.