సోలార్ మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీరు కల్పించాలని జనసేన డిమాండ్

*ఇంటింటికి జనసేన మాటలు
*జనసేన మాజీ ఎంపీటీసీ సాయిబాబా, దురియా, గేమ్మిలి, సన్యాసిరావు.

అరకు నియోజకవర్గం, అనంతగిరి మండలం కొండిబ పంచాయతీ పరిధిలో గల కొత్తవలస గ్రామంలో ఇంటింటికి జనసేన మాటలు తీసుకెళ్ళు భాగంగా శుక్రవారం జనసేన పార్టీ ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా, గేమ్మిలి, సన్యాసిరావు, రామ్ చందర్ తదితరుల ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించి ముందుగా గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు, గ్రామాల్లో సోలార్ మరమ్మతులు ఉన్నప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని జనసేన దృష్టికి తీసుకువచ్చారు, అనంతరం జనసేన మాజీ ఎంపిటిసి సాయిబాబా, సన్యాసి రావు మాట్లాడుతూ… ప్రభుత్వం తక్షణమే స్పందిస్తూ సోలార్ మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జనసేన మాటలు, సిద్ధాంతాలు క్లుప్తంగా గిరిజనులకు వివరించారు, అనంతరం మరమ్మత్తులో ఉన్న సోలార్ ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.