జనసేన క్రియాశీలక సభ్యత్వం – భద్రమైన భవితవ్యం: దారం అనిత
దేశంలోనే ఏ పార్టీ కల్పించని బీమా సౌకర్యాన్ని జనసేన పార్టీ జన సైనికులకు వీర మహిళకు కల్పించింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకు, వీర మహిళలకు క్రియాశీలక సభ్యత్వంతో పాటు, ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని అలాగే ఈ ప్రమాదంలో గాయాలపాలై తే 10 వేల నుండి 50 వేల వరకు నగదు సహాయం చేయబడుతుంది. కాబట్టి జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకో వలసిందిగా.. అదేవిధంగా గత సంవత్సరం ఎవరైతే క్రియాశీలక సభ్యులుగా ఉన్నారో వారు వారి సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా పార్టీ తరఫున చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి దారం అనిత తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-26-at-11.16.27-AM-1024x459.jpeg)