హిందూపురం జిల్లా గా ప్రకటించాలని జనసేన డిమాండ్

హిందూపురం జిల్లా ఏర్పాటు కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్ష లో భాగంగా 12వ రోజు హిందూపురం జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో అంబేథ్కర్ సర్కిల్ నుండి హిందూపురం జిల్లా ద్రోహుల శవయాత్ర నిర్వహించి దీక్షా శిబిరంలో కూర్చోవడం జరిగింది. ఈ శవయాత్రలో భారీగా జనసైనికులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయాన్ని మార్చుకొని హిందూపురాన్ని జిల్లా కేంధ్రంగా ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని జనసేన పార్టీ తరుపున వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని ఆకుల ఉమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జిల్లా కార్యదర్శి రమణ, సంయుక్త కార్యదర్శులు కొల్లకుంట శేఖర్, మొద శివ హిందూపురం, లేపాక్షి, పరిగి మండల అధ్యక్షులు చక్రవర్తి, సురేష్ బాలాజీ గౌడ్ నాయకులు నిమ్మకాయల రాము, మల్లెపూల మధు, గాజుల నాగభూషణం, బొంచేరువు భాస్కర్, అంజి, విజయ్, పవన్, రమేష్, రామంజి, దాదు, నరేష్, శ్రీనివాస్, ప్రశాంత్, మనోహర్, కిషోర్, సతీష్ దుర్గా, చిన్నా, మౌలి, ప్రశాంత్, హనుమంతు, గోపి, పాపన్న, శివ శంకర్, విష్ణు, ఉపేంద్ర, కుమార్ మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీక్షలో కూర్చొన్న వారికి అఖిలపక్షం నాయకులు బాలాజీ మనోహర్, రమేష్ రెడ్డి, ఉమర్ ఫారూఖ్, బార్ అసోషియేషన్ సభ్యులు శివశంకర్, మనోహర్ రెడ్డి తదితరులు మద్ధతు తెలిపారు.