పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన నాతి నాగేశ్వరరావు

మంగళవారం రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పితాని బాలకృష్ణ మరియు అయినవిల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గుర్రాల రాంబాబు ఆధ్వర్యంలో ముమ్మిడివరం మండలం, తానే లంక గ్రామస్తులు నాతి నాగేశ్వరరావు వై.ఎస్.ఆర్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి మంగళవారం జనసేన పార్టీ లో జాయిన్ అవ్వటం జరిగింది. వీరి వెంట కొండు కుదురు గ్రామస్తుడు పెట్ట విష్ణు ప్రసాద్ కూడా.. జాయిన్ అవ్వడం జరిగింది. ఇరువురికి బాలకృష్ణ జనసేన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయేది జనసేన పార్టీ ప్రభుత్వమని ముమ్మడివరం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మా ఎస్సీ సోదరులు జాయిన్ అవ్వడం జరుగుతుందని బాలకృష్ణ జనసేన పార్టీ విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.