మహాటీవీ రిపోర్టర్ వాహనాన్ని దగ్ధం చేసిన ఘటనను తీవ్రంగా ఖండించిన జనసేన

పిడుగురాళ్ల పట్టణానికి చెందిన మహా టీవీ రిపోర్టర్ గోపిశెట్టి మల్లేశ్వరి ద్విచక్ర వాహనాన్ని అర్దరాత్రి గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, జనసేన జిల్లా కార్యదర్శి కటికం అంకారావు అన్నారు. స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఘటనపై స్పందిస్తూ, పోలీసు వారిని సమగ్ర విచారణ జరిపి, నిందితుల్ని వెంటనే అరెస్టు చేయమని ఆయన ఆదేశాలు ఇవ్వాలి కానీ, జనసేన చేసి ఉండొచ్చు, బిజెపి చేసి ఉండొచ్చు అని మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. ఆయన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నామన్నారు. సమాజంలో జరిగే మంచినైనా, చెడునైనా, నిజాన్ని నిష్పక్షపాతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారంలో ప్రముఖ పాత్ర వహించే, మీడియా వ్యక్తులపై, కక్షసాధింపు చర్యలకు పాల్పడడం దారుణమని, ఆయన అన్నారు. జనసేన పార్టీ తరుపున ఆమెకు అండగా ఉంటామని ఆయన తెలియజేసారు. మీడియా వ్యక్తులపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వ్యక్తులను, వెంటనే సమగ్ర విచారణ జరిపి, దుండగులను తగిన విధంగా శిక్షించి, ప్రజాస్వామ్య విలువలను కాపాడి, ఇకపై మీడియా వ్యక్తులపై ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకొనవలసిందిగా, మహాటివి రిపోర్టర్ కు రక్షణ కల్పించవలసిందిగా, పోలీస్ వారిని కోరుచున్నామని ఆయన తెలిపారు.