గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియశీల సభ్యత్వం కార్యక్రమం
గాజువాక, గురువారం గాజువాక నియోజకవర్గంలో విశాఖ జిల్లా నాయుకులు తిప్పల రమణ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియశీల సభ్యత్వం కార్యక్రమం గాజువాక జనసేన కార్యకర్తల మధ్య ఘనంగా జరిగింది. జనసేన పార్టీ పి.ఎ.సి సభ్యులు, గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ కోన తాతరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జనసైనికులు అందరు క్రియశీల సభ్యుత్వం చేసుకోవాలి. ఈ 5 లక్షల భీమా అవకాశం అందరు ఉపయోగించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో మొదటి క్రియశీల సభ్యుత్వంలో గాజువాక నియోజకవర్గం ఉంటుంది అని జనసేన నాయుకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు కాద శ్రీను, అల్లు రామారావు, ములకలపల్లి వంశీ, ఆర్మీ గోవింద్, ఉంగరల్ల శ్రీను, సోమశేఖర్, కళావతి, మురళీ దేవి, రామలక్ష్మి, షాలిని, నాయుడు, ఆనంద్, భాస్కర్ మరియు జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-03-at-9.53.53-PM-1024x473.jpeg)