అధికారులను ప్రశ్నించిన పాయకరావు పేట జనసేన
పాయకరావు పేట నియోజవర్గం, కోటవురట్ల మండలం, కె.వెంకటాపురం గ్రామంలో ఇంటి పన్ను కట్టించుకోవడానికి వచ్చిన అధికారులను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలదీశారు. అధికారుల్ని జనసేన పార్టీ కార్యకర్తలు ఇంటి పన్ను,నీటి పన్ను, డ్రైనేజ్ పన్ను, లైబ్రరీ సెస్, కరెంట్ పన్ను, ఇవన్నీ ఇంటి పనుల్లో కలిసి కడుతున్నాము. కానీ మా పంచాయతీలో ఈ డ్రైనేజీ కానీ, నీలి గాని, కరెంట్ గాని, చాలా ఇబ్బందిగా ఉందని అధికారులతో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలియజేశారు. అలాగే అధికారులు ఇవన్నీ త్వరలో చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-04-at-2.59.42-PM-1024x461.jpeg)