మరణించిన జనసైనికుని కుటుంబానికి బాసటగా వీరమహిళ ప్రియాసౌజన్య

పశ్చిమగోదావరి జిల్లా, నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, వడ్లూరు గ్రామంలో 4 నెలల క్రితం మన జనసైనికుడు మేడపాటి దుర్గాప్రసాద్ చనిపోయినప్పుడు పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఐదు లక్షల రూపాయల భీమా చెక్కు అందజేసిన సమయంలో రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య వారికి అండగా ప్రతినెల నిత్యావసర సరుకులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తు ప్రతి ప్రతినెల నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. అంతేకాకుండా అదే గ్రామంలో దూడు నాగలక్ష్మి అనే మంచానికి పరిమితం అయి పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధురాలికి 7000 సహాయం అందిస్తానని హామీ ఇచ్చి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.