కంచికచర్లలో జోరుగా క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం

కంచికచర్ల, ఆదివారం కంచికచర్ల పట్టణంలో జనసేన పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేయించుకున్నట్లు జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పుట్టా స్వరూప తెలిపారు. కంచికచర్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదురుగా జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కౌంటర్ వద్ద మండలంలోని పలు గ్రామాల నుండి జనసేన పార్టీ అభిమానులు క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేయించుకున్నారని ఆమె తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ప్రమాద భీమా 50 వేల రూపాయలు మెడికల్ బీమా లభిస్తుందని ఈ అవకాశాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ప్రమాదంలో వ్యక్తి ని కోల్పోవడం కుటుంబం రోడ్డున పడటమేనని అటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద భీమాతో ఐదు లక్షల రూపాయలు అందించి కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవాలని సంకల్పంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా కోటి రూపాయలు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దినేడి హరిబాబు, కొఠారు దేవేంద్ర, తోట ఓంకార్, పుప్పాల వేణుగోపాల్, సాయి హేమంత్, కుసునూరి నరసింహారావు, కుర్రా నాని, పెరుమాళ్ళ సురేష్, సాయిబాబా, గోపి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.