జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి: పుంగనూరు జనసేన

మార్చి 14వ తేదిన మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం నందు జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని పుంగనూరు జనసేన నేత పగడాల రమణ కోరారు.

మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఆ రోజు కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేయాలని మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందుకుగాను పుంగనూరు నియోజకవర్గం నుండి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గం నుండి ప్రతి మండలం నుండి వెహికల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే సభకు రావాలి అనుకుంటున్నారో.. వారంతా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరై సోమవారం జరగబోయే ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పగడాల రమణ, అధ్యక్షులు విరూపాక్షి, పట్టణ అధ్యక్షులు మనీ హరి నాయక్, నరేష్ రాయల్, చంద్ర బాలాజీ నాయక్, చైతన్య రాయల్, శీను రెడ్డి, కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.