తులసి రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..

పులివెందుల, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై తులసి రెడ్డి చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి తీవ్రంగా ఖండించి చారు. అనంతరం పద్మావతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తులసి రెడ్డిని పులివెందుల ప్రజలు ఎప్పుడో తరిమికొట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ మరియు తులసి రెడ్డి ముగిసిపోయిన అధ్యాయానికి చెందిన వారన్నారు. తులసి రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే.. వైసిపి పార్టీకి కీలుబొమ్మగా మారారేమో అని అనుమానం వస్తోందన్నారు. ప్రగల్బాలు పలికే తులసి రెడ్డికి ఇపుడు దామోదరం సంజీవయ్య పేరు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. దామోదరం సంజీవయ్య గారి నిజాయితీ పరిపాలన గురించి దేశ వ్యాప్తంగా తెలియజేస్తున్నది ఒక్క జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మాత్రమే అన్నారు. నిజంగా తులసి రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పులివెందుల కేంద్రంగా ఉండి వైఎస్. జగన్ రెడ్డి పై పోరాటం చేయాలన్నారు. అంతేకాని పేపర్ ప్రకటనలకే పరిమితం అయ్యి కీలుబొమ్మగా వ్యవహారాలు చేయొద్దని పసుపులేటి. పద్మావతి హితువు పలికారు.