సమస్య ఎక్కడ ఉన్నా పరిష్కారం జనసేన మాత్రమే: దార్ల కుమారి లక్ష్మి

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు, ఏనుగుపల్లి వారి వీధిలో చాలా కాలంగా వాటర్ పైప్ లైన్ పనులు పెండింగులో ఉండి ప్రజలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు. పంచాయతీలో ఎన్నిసార్లు చెప్పినా వాయిదా వేస్తూ వచ్చారు. దీనితో జనసేన పార్టీ నుండి రాజోలు ఎంపీటీసీగా ఎన్నికైన దార్ల కుమారి లక్ష్మి మొట్టమొదటి మండల సమావేశంలో ఈ సమస్యపై గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి కావలసిన పర్మిషన్స్ మరియు నిధులు సాంక్షన్ చేయించుకోవడం జరిగింది. శుక్రవారం వాటర్ పైప్ లైన్ పనులు కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టారు. సమస్య ఎక్కడ ఉన్నా పరిష్కారం జనసేన మాత్రమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు పాల్గొన్నారు.