దాడుల సంస్కృతిని విడనాడాలి – వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దాడుల సంస్కృతి విడనాడాలని జనసేన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు ఇటీవల టిఆర్ఎస్ పార్టీ నేతలు దాడి చేసిన బీజేవైఎం విజయభాస్కర్ రెడ్డి కుటుంబాన్ని జనసేన బృందం పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా దాడి సంస్కృతిని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని వెంటనే వాటికి చరమగీతం అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు నిర్వహించి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.ఆర్.రఘు, జానీ, రాకెష్ రెడ్డి, రేచర్ల శేఖర్, బారిగారి రాజేందర్, సూర్య, జెర్రిపాటి చంద్రశేఖర్, సంతోష్, గౌరవ్, బొట్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు.