హిందూ ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న జనసేన నాయకులు
ములకలచేరువు, మన సనాతన హిందూ ధర్మాలను జానపద గేయ భజనల రూపంలో తరువాతి తరం వాళ్లకు అందిస్తూ ఎన్నో భజన బృందాలను ఏర్పాటు చేసి, తిరుమల కొండ మీద భజనలు చేయిస్తున్నది మన జానపద కళాకారుల సంఘం. అన్నమాచార్యుల వారి వారసులు ఈ సంఘంలోని కళాకారులని సన్మానించే కార్యక్రమం మండలాల వారిగా చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అనగా 22 మార్చ్ 2022 వ తేదీన పెద్దపాళ్యం ఆంజనేయస్వామి ఆలయంలో సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రావు అద్వర్యంలో, ములకలచేరువు మండల భజన బృందాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ ధర్మానికి మన వంతు సహాయం చేయడానికి, పెద్దపాళ్యం కామాక్షి అంజి ఆలోచనతో, ములకలచేరువు మండల జనసేన అధ్యక్షులు సాయినాథ్ అద్వర్యంలో భజన బృందాలకు మజ్జిగ ప్యాకెట్ల వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన ప్రధాన కార్యదర్శులు కిరణ్ రాయపు, సుదర్శన్, సురేష్, శ్రీధర్, నరేష్, అమర, రామాంజులు, సుబ్బరామ్, ప్రభాకర్ నాగరాజు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-22-at-23.00.57-1024x469.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-22-at-23.00.57-1-768x1024.jpeg)