మండే వేసవిలో జనసేన చల్లని చలివేంద్రం

చిత్తూరు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా చల్లని చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సుభాషిణి మరియు మహిళా నాయకురాలు శ్రీమతి కోకిల ల సూచనల మేరకు, చంద్రగిరి నియోజకవర్గ నాయకులు దేవర మనోహర, తిరుపతి మండల అధ్యక్షులు రాయల్ వెంకట్ సమక్షంలో, పంచాయతీలోని యువరాజ్, శేఖర్ మరియు ఇతర స్థానిక నాయకులు నిర్వహించిన చలివేంద్రం ప్రారంభోత్సవానికి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. పంచాయతీలోని ప్రజలకు చేరువుగా, వేసవిని దృష్టిలో పెట్టుకొని దాదాపు వెయ్యి మంది ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేశామని స్థానిక నాయకులు వివరించారు. ఈ కార్యక్రమఅంలో భారీ ఎత్తున జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.