పోలవరం నియోజకవర్గం జనంలో జనసేన

పోలవరం, ఇంచార్జి చిర్రి బాలరాజు పోలవరం మండల పర్యటనలో బాగంగా గురువారం కొత్తరామయ్య పేట పంచాయితీ సందర్శిన్చిన చిర్రి బాలరాజు, జనసేన పార్టీ తరుపున వార్డు మెంబర్ గా గెలిచిన మేడూరి గంగారావు తో కలిసి గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇది నిర్వాసితుల గ్రామం ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు తాగు నీరు లేదు, డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థం, గృహ నిర్మాణం సరిగ్గా లేదు, కొన్ని ఇళ్ళు నిర్మాణం మద్యలో అపేసారు, ఇలా అనేక సమస్యలని చిర్రి బాలరాజు దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. అలాగే కొత్త రామయ్య పేటలో ఉన్న ఇసుక కాలువని సందర్సించారు, వర్షంలో ఇది తీవ్రంగా ప్రవహిస్తుందని రైతులు తెలియ చేసారు. కాలువ మొత్తం పూడికపోయింది అని తెలియచేసారు. సంబందిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. అలాగే యల్‌ యం డి పేట పంచాయితీ, జిల్లెళ్ళగూడెం పంచాయితీలు కూడీ సందర్శిన్చిన ఇంచార్జి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం చేసేలా పోరాడతామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు గుణపర్తి సత్యనారాయణ, పట్టిసీమ గ్రామ అధ్యక్షుడు కరిబండి రాజు, ఉపాధ్యక్షులు తెలగంశెట్టి రాము, కురసం రమేష్, ప్రధాన కార్యదర్శులు చీకట్ల సాయి కృష్ణ మూర్తి, మామిడిపల్లి ప్రసాద్, కాకి అయ్యప్ప, తుర్రం రమేష్ మరియు స్థానిక గ్రామ పంచాయితీ కార్యకర్తలు పాల్గొన్నారు.