కళ్యాణదుర్గం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వానికి 3 రోజుల్లో సమయం ముగుస్తుంది. కాబట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని జనసేన పార్టీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు తప్పకుండా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకున్న ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే హాస్పిటల్లో 50 వేల రూపాయలు, మరణించిన ఎడల 5 లక్షలు కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీ గురించి గ్రామ స్థాయిలోకి ప్రజలకి తెలియజేసే బాధ్యత మనందరం తీసుకొని క్రియాశీలక సభ్యత్వాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాముని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, జయ కృష్ణ, ఆంజనేయులు, ఈరన్న, రాజు, రామలింగ, కాంత రాజ్, మహేష్, వీర మహిళ షేక్ తార, జాకీర్, నరేష్, లక్ష్మణ్ జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.