తామరఖండిలో పర్యటించిన బాబు పాలూరు

బొబ్బిలి, తామరఖండి గ్రామంలో జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు పర్యటించడం జరిగింది. తమ గ్రామం నుంచి ఇసుక అక్రమ రవాణాకు అధికార పార్టీ శ్రేణులు కొంతమంది పన్నాగం పన్నుతున్నారని గ్రామస్థులు ఆందోళన చెందుతున్న తరుణంలో బాబు పర్యటించి గ్రామ ప్రజలకు ధైర్యం చెప్పారు. మీరంతా ఐకమత్యంతో ఉంటే ఎంతటి వారైనా మీ గ్రామం నుంచి ఇసుక కాదు కదా ఇసుక రేణువు కూడా తీసుకుపోలేడు అని భరోసాను ఇచ్చారు. మీ మీద ఎవరు ఎలాంటి ఒత్తిళ్లు పెట్టినా మాకు ఒక్క ఫోన్ కాల్ చెయ్యండి చాలు మీకు జనసేన అండగా ఉంటుందని గ్రామ ప్రజలకు ధైర్యం చెప్పారు. అలా గ్రామం అంతా పర్యటించి గ్రామ సమస్యలు తెలుసుకున్నారు. ఇసుక రీచ్ వద్దకు వెళ్ళి పరిశీలించి ఇసుక ఆక్రమణ జరిగితే మీ గ్రామం భవిష్యత్ లో ప్రకృతి కోపానికి బలైపోక తప్పదని హెచ్చరించారు. కావున గ్రామ ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి ఈ ఇసుక ఆక్రమణను వ్యతిరేకించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.