చిల్లపల్లి శ్రీనివాసరావుని కలిసిన తాడేపల్లి నగర పరిధిలో ఉన్న రైతులు

మంగళగిరి, జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుని తాడేపల్లి నగర పరిధిలో ఉన్న (యూ1 రిజర్వడ్ జోన్) రైతులు కలిశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న టిడిపి పార్టీ యూ1 రిజర్వడ్ జోన్ ను ప్రకటించింది. అప్పుడు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ కి చెబితే మన పార్టీ అధికారంలోకి రాగానే తొలగించేద్దాంమని చెప్పారు. మళ్లీ ఆయన గెలుపుకు ఎంతో కృషి చేసాము. వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా.. ఎమ్మెల్యే ను అడుగుతుంటే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని చెబుతున్నారు అని చిల్లపల్లి శ్రీనివాసరావుకు తెలిపారు. రైతులకు తోడుగా ఉంటానని యూ1 రిజర్వడ్ జోన్ ఎత్తేసే వరకు ప్రభుత్వంతో పోరాడతామని.. రైతులకు అండగా ఉంటామని చిల్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు దొంతి రెడ్డి సాంబిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, తులసి బాస్, మరియు జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వర రావు (ఎస్.ఎన్.ఆర్), గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, బల్ల ఉమామహేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.