అధికార పార్టీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకి తెలిసేలా చెప్పాలి: గాదె

గుంటూరు, అధికారం ఉందని విర్రవీగుతూ.. ప్రజలని పీడించి పిప్పి చేస్తున్న ముఖ్యమంత్రి పాలనను అడుగడుగునా ప్రజలను చిదరించుకుంటున్నారని, దీనిని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలని చేయాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధులుగా ఎన్నికైన వారికి సూచించండం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికార ప్రతినిధులుగా ఎన్నికైనా తవిటి భావన్నారాయణ, ఆళ్ల హరిని సన్మానించాను. రాష్ట్రంలో అదేవిధంగా గుంటూరు జిల్లాలో జరిగే అనేక ప్రజా సమస్యలపై స్పందించాలని, ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలపై పూర్తి స్థాయిలో విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలలోకి తీసుకెళ్ళి… జనసేన పార్టీని మరింత బలపేతం చేయాలని చెప్పడం జరిగింది. రాబోయే కాలం జనసేనదేనని.. ముఖ్యమంత్రి స్థానం పవన్ కళ్యాణ్ అధిరోహించే విధంగా అందరూ పాటుపడాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.