పవన్ అన్న ఆశయాలకు అనుగుణంగా సేవాకార్యక్రమాలు చేస్తాం: సుంకర రమేష్

తూర్పుగోదావరి జిల్లా, ఉభయతెలుగు రాష్ట్రాలలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్న సేవామూర్తి సుంకర రమేష్, విజయభారతి(కేశనపల్లి@హైదరాబాద్) ల పెళ్లిరోజు సందర్భంగా రాజోలు మండలం మెరకపాలెం గ్రామానికి చెందిన ఒక వికలాంగునికి త్రిచక్ర వాహనం అందించారు. ఈ సందర్భంగా పలువురు రమేష్ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాట్రేనిపాడు జనసేన సర్పంచ్ అడబల శ్రీనివాస్, మెరకపాలెం సర్పంచ్ గిడుగు బుజ్జిబాబు, మలికిపురం మండల ఎంపీపీ శ్రీమతి మేడిచేర్ల వెంకట సత్యవాణి రాము, మెరకపాలెం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు గిడుగు బ్రహ్మాజి, జనసేన సీనియర్ నాయకులు గిడుగు ప్రకాష్, పాశర్లపూడి జనసేన వార్డు మెంబర్ ఆచంట ఫణి, అప్పనపల్లి జనసేన క్రియాశీలక సభ్యులు మేడేపల్లి సత్య మరియు గ్రామస్థులు పెద్దలు పాల్గొన్నారు. అనంతరం పి గన్నవరం నియోజకర్గం గంగలకుర్రు గ్రామానికి చెందిన బ్రహ్మయ్య కుమార్తె కుటుంబానికి ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆచంట ఫణి, సత్య మరియు జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినిడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానంతో సామాన్య జనసైనికులకు సుంకర రమేష్ చేస్తున్నా సేవా కార్యక్రమాలను కొనియాడడం జరిగింది.