ఆమదాలవలసలో జనసేన జెండాను ఆవిష్కరించిన పేడాడ రామ్మోహన్

ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం ఓ.వి.పేట లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు. అనంతరం సభలో ప్రసంగించిన ఆయన రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ఆత్మహత్యలతో దయనీయంగా మారిందని, వారిని ఆదుకునేందుకు పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అధికార పార్టీ అరాచక పాలనను ప్రజలకు వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎంపిటిసి విక్రమ్, కొత్తకోట నాగేంద్ర, రమణ, జయరాం, మౌళి, సురేష్, రాంబాబు, కిషోర్, కృష్ణ, కోమలరావు తదితరులు పాల్గొన్నారు.