పవన్ కళ్యాణ్ స్పూర్తితో పేడాడ రామ్మోహనరావు 2 లక్షల విరాళం
ఆముదాలవలస, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతు కుటుంబాలకు అండగా ఉండాలని, ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చేందుకు కుటుంబానికి లక్ష రుపాయల ఆర్ధిక సాయం ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఆయన 5 కోట్ల విరాళం కూడా ప్రకటించడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తోడుగా ఆముదాలవలస నియోజకవర్గం తరుపున ఇంచార్జ్ పేడాడ రామ్మోహనరావు రెండు లక్షల రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/8e209857-244a-41b5-9f68-c64af4e8367c-1024x689-1.jpg)