జనసేన కోసం అహర్నశలూ శ్రమించి కరోనా మహమ్మారి చేతిలో అస్తమించిన నిస్వార్థ జనసైనికుడి కి అశ్రు నివాళి
కృష్ణా జిల్లా విజయవాడ లో నీ తూర్పు నియోజకవర్గం లో జనసేన కోసం అహర్నశలూ శ్రమించి కరోనా మహమ్మారి చేతిలో అస్తమించిన నిస్వార్థ జనసైనికుడి కి అశ్రు నివాళి…
జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గారు తన తోటి జనసైనికుడు, నిస్వార్థ కార్యకర్త అయినటువంటి కీర్తి శేషు లు శ్రీ తుంగల రామాంజనేయులు గారి ప్రధమ వర్ధంతి సందర్భం గా విజయవాడలో వారి సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు..
ఈ కార్య్రమానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ నుండి ముఖ్య అతిథులు గా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, బొనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, గాదె వెంకటేశ్వర రావు గారు, అంజిబాబు గోవిందం గారు, పోతిన మహేష్ గారు, అక్కల గాంధీ గారు పాల్గొన్నారు..
అనంతరం పెద్దలు అందరూ వారి ప్రగాఢ సానుభూతి తేలియజేశారు..
తుంగల రామాంజేయులు గారి సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు..
సొంత వారిని పాటించుకోవటానికి ఇబ్బంది గా మారిన ప్రస్తుత సమయంలో ఒక జనసేన కార్యకర్త మరియు మిత్రుని కోసం అమ్మిశెట్టి వాసు గారు అండగా నిలబడి ఈరోజు ప్రధమ వర్థంతి నీ ఘనంగా నిర్వహించడం ఎంతో స్ఫూర్తి దాయకం అని చెప్పారు..
అంజి బాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రామాంజనేయులు గారి కుటుంభానికి ఎప్పుడు అండగా ఉంటారని అతి త్వరలో వారి ఇంటికి విచ్చేసి కుటుంబాన్ని పరామర్శిస్తారు అని సభాముఖం గా తెలియచేసారు..
అమ్మిశెట్టి వాసు గారు మాట్లాడుతూ ఆంజనేయులు గారు తో ఉన్న అను బంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వగానికి లోనయ్యారు..
తాను ఎప్పుడూ వారి కుటుంబ సభ్యులు కి అండగా ఉంటానని వారి మంచి చెడులు స్వయం గా చూసుకుంటానని తెలియచేసారు..
ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు , కార్యకర్త లు, అభిమానులు, రామాంజనేయులు గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.