జనసేనపార్టీ ఆధ్వర్యంలో చిరు సహాయం

సుండుపల్లి గ్రామ పరిధిలో ఉన్న అగ్రహారం గుట్ట సమీపంలో నివాసముంటున్న గడ్డం రమేష్ ఇటీవల కాలంలో అనారోగ్యంతో హఠాత్తుగా మరణించారు. ఆయన వృత్తి బేల్దారి దినసరి వ్యాయామం చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి, ముగ్గురు చిన్న వయసు ఆడపిల్లలు ఉన్నారు. ఆ విషయం తెలుసుకుని వారి కుటుంబానికి వెంటనే ఆయన సతీమణి గడ్డం రెడ్డమ్మ చేతికి 5 వేలు రూపాయలు చిరు సహాయంగా జనసేన ఎన్నారై, కాపు సంక్షేమసేన మండల అధ్యక్షులు మచ్చ లక్ష్మీనారాయణ సహకారంతో జనసేనపార్టీ ఆధ్వర్యంలో రామశ్రీనివాసులు ద్వారా సుండుపల్లి మండల జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు సమక్షంలో అందించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత మండల అధ్యక్షులు అన్నయ్యగారి రవీంద్ర, జనసేన నాయకులు ఓబులేసు, రాజగోపాల్, మున్నా, జనసేన వీరమహిళలు రెడ్డిరాణి, సుంకర సుధ, జనసైనికులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.