పాణ్యం జనసేన ఆధ్వర్యంలో జనసేన చలివేంద్రము

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గ జనసేన నాయకులు వై బజార్ ఆధ్వర్యంలో శ్రీ చిన్నటేకూరు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో.. జనసేన చలివేంద్రమును.. నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ చింతా సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సదర్భంగా బాజరి మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 18 గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు కలుస్తున్నారని.. మధ్యాహ్న సమయంలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీంతో ఉచితంగా చలివేంద్రం ప్రారంభించామన్నారు. వారంలో ఒకరోజు మజ్జిగ, మరొక రోజు బెల్లం పానకం, మిగతా మిగతా రోజులు మినరల్ వాటర్ అందుబాటులో ఉంచుతామని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగ కమిటీ కార్యదర్శి తెలుగు గోవిందరాజు, కోడుమూరు నియోజకవర్గ నాయకులు ఆకెపోగు రాంబాబు, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ బాబు, నందికొట్కూరు నియోజకవర్గ నాయకులు ఎమ్ శ్రీనివాస్ గౌడ్రు, నియోజకవర్గ జనసేన నాయకులు మంజునాథ్, సుధాకర్, హుసేన్, రంగస్వామి, జి.శివ, తిమ్మరాజు మరియు గ్రామ జనసైనికులు, వీర మహిళలు పాల్గోనడం జరిగింది.