పిఠాపురం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు

పిఠాపురం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరియు సమసమాజాన్ని నిర్మించడానికి జీవితకాలం కష్టపడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆదేశానుసారం పిఠాపురం పట్టణంలో ముందుగా పార్టీ కార్యాలయంలో వెల్దుర్తి తాటిపర్తి వన్నెపూడి పి.రాయవరం గ్రామాల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి పట్నంలో అంబేద్కర్ సెంటర్ లో ఉన్న మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత భారత రాజ్యాంగం సృష్టికర్త స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయ మంత్రి మరియు గణతంత్ర దేశ వ్యవస్థాపకుడు డాక్టర్ భీం రావ్ అంబేద్కర్ దేశ ప్రజలందరికి స్వేచ్ఛ సమానత్వం కల్పించిన గొప్ప దార్శనికుడు స్ఫూర్తి ప్రదాత అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం, కుల, మత రహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్‌ తన జీవితకాలం పోరాటం చేశారు. అటువంటి గొప్ప మహనీయులు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ చల్లా లక్ష్మి, పుణ్య మంతుల బాబురావు, లీగల్ అడ్వకేట్ కమిశెట్టి సత్యవాణి, మేళం బాబి, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శిలు మొగిలి అప్పారావు, గోపు సురేష్, ఎంపీటీసీ అభ్యర్థిలు కేతినిడి గౌరీ నాగలక్ష్మి, రాసంశెట్టి కన్యక రావు, యాండ్రపు శ్రీనివాస్, తోట సతీష్, కంద సోమరాజు, మత్స అప్పారావు, నాగేశ్వరరావు, శిరీష, వీరమహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.