అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్

కైకలూరు నియోజకవర్గం , ముదినేపల్లి మండలం అంటరానితనాన్ని రూపుమాపిన మహా మేధావి, సామాజికవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ అన్నారు. డా. బి ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి వేడుకలు ముదినేపల్లిలో బీజేపీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక బస్ స్టాండ్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కన్వీనర్ పైడపాటి శివ శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటప్రోలు కృష్ణ, జనసేన మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య, జిల్లా కార్యదర్శి వెల్పురి నానాజీ, బీజేపీ జిల్లా కార్యదర్శి గాజుల సిద్దర్ కుమార్, మండల జనసెన నాయకులు అంబుల భరత్, వడ్లాని ఆంజనేయులు, ఎస్సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మొవ్వ ఫణి, బసినసెట్టి కిషోర్, దాసరి శ్రీను, మహిళ ఉపాధ్యక్షురాలు సత్యవోలు నాగలక్ష్మి, గణేష్, రెడ్డి నాగలక్ష్మి, రాజేష్, కానుమురి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.