అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన వింజమూరు జనసేన

వింజమూరు మండలంలో బంగ్లా సెంటర్ లో గురువారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు షేక్ సుభాని భాయ్, ప్రధాన కార్యదర్శి సాధం ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి షేక్ బద్దుల్లా, జనసైనికులు, భరత్, స్వామి, నిజాం, చంటి తదితరులు పాల్గొన్నారు.