అంబేద్కర్ కు గంధం ఆనంద్ ఘన నివాళి

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీ రామ్ తాళ్లూరి గారి ఆదేశాల మేరకు.. భారత రత్న డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంధం ఆనంద్ మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఆయన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వీరమహిళా విభాగం అధ్యక్షులు భోగ హరిప్రియ, ప్రసన్న,ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మేడబోయిన కార్తీక్, ఉపాధ్యక్షులు యాసంనేని అజయ్ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలవరపు మణికంఠ, జనసేన పార్టీ కార్యకర్తలు కూరకుల గోపీకృష్ణ, చల్లా శ్రీకాంత్, దేవరకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు.