బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం భారత రాజ్యాంగం రచించారు

డోన్ నియోజకవర్గం బేతంచెర్ల మండలం జనసేన పార్టీ ఆద్వర్యంలో “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్” 131వ జయంతి సందర్భంగా బేతంచెర్ల నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మండల నాయకులు మద్దయ్య నాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో అందరికి సమ నాయ్యం జరగాలనే ఉద్దేశంతో సామాన్య బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం మన భారత రాజ్యాంగం రచించారు. ఆయన అందించిన సేవలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నేడు ఆయనను ఒక కులానికే పరిమితం చేసి జాతి నాయకుడుగా ముద్ర వేశారు. ఆయన జాతి నాయకుడు కాదు జాతీయ నాయకులు కావునా యువత స్పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల జనసేన క్రియాశీలక జనసైనికులు పరమేష్, నవీన్ కుమార్, చిన్ను, బ్రహ్మం పాల్గొన్నారు.