సర్వేపల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు

సర్వేపల్లి, ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కావలి హరిజనవాడ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ ఆశయం అన్నివర్గాలకు న్యాయం జరగాలి అంటే అయన సిద్ధాంతాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే ఒక జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు జనసేన పార్టీ నాయకులు సురేష్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు శ్రీపతి రాము, స్థానికులు కావాలి పవన్ కుమార్, హరిబాబు, రహీం భాయ్, వీరబాబు, రవి కుమార్, సందీప్, శ్రీహరి, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.