కేతనకొండ జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం

ఇబ్రహీంపట్నం మండల కేతనకొండ గ్రామ జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే రైతులకు జనసేన పార్టీ అధినాయకుడు కొణిదెల పవన్ కళ్యణ్ కవులు రైతులకు అండగా నిలిచి వారికి ఆర్ధిక సహకారం అందించటాన్ని హర్షిస్తూ… కేతనకొండ రైతుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితులుగా జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గం ఇంచార్జి అక్కల రామ్మోహన్ రావు(గాంధీ), జనసేన నాయకులు అంజిబాబు, నాగబాబు, జిల్లా కార్యదర్శి శ్రీమతి చింతల లక్ష్మి ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి తేజ, ప్రవీణ్, చిట్టేలు కోటేశ్వరరావు పాల్గొన్నారు. సామాజిక స్పూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కేతనకొండ జనసేన పార్టీ నాయకులు కొమ్మూరు హనుమంతరావు, కొమ్మూరు వెంకట స్వామి, అశోక్ మరియు కేతనకొండ రైతులకు మరియు కేతనకొండ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తకు అభినందనలు తెలిపారు.