విద్యుత్ చార్జీలు పెంచినందుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

విద్యుత్ చార్జీలు పెంచినందుకు నిరసనగా కొయ్యలగూడెం టౌన్లో జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని మరియు అప్రకటిత విద్యుత్ కోతలు ఆపవలసిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ.. స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ నుంచి వినాయకుడి గుడి సెంటర్ మరియు గూడెం సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కరెంట్ చార్జీలు వెంటనే తగ్గించాలని జనసైనికులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మేకల తేజ, సంకు మధు, అబ్బా దాసులు, వేణు, ఏడుకొండలు, కూసుమంచి శ్రీను, నాని, బాలు, శ్రీరామ్, పండు, ఉదయ్, ఆకాష్, ప్రకాష్, కిషోర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.