మహిళ పై జరిగిన అత్యాచార ఘటనను ఖండించిన కటికం అంకారావు
పల్నాడు జిల్లా, గురజాలలో గుర్తు తెలియని మహిళ పై జరిగిన అత్యాచారాన్ని జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి కటికం అంకారావు తీవ్రంగా ఖండించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి, బాధితురాలికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో దిశాచట్టం పోక్స్ యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ కూడా, రాష్ట్రవ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతున్నాయంటే దానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన మండిపడ్డారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నిందితులను వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు.. జనసేన పార్టీ తరపున అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన 18వ వార్డ్ కౌన్సిలర్ చింతకాయల కళ్యాణ్, ప్రోగ్రాం కమిటీ మెంబర్ పసుమర్తి మణి, షేక్ అజీస్, కటకం కోటేశ్వరావు, మణికంఠ, మొగిలి కృష్ణ, కృష్ణ నాయక్, తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-16-at-12.42.17-PM-1024x461.jpeg)