నూతనంగా నియమితులైన కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వినుతా కోటా

తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి నూతనంగా నియమితులైన కలెక్టర్ కే.వెంకటరమణా రెడ్డి, ఐ.ఏ.ఎస్ ని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా నియోజకవర్గ మండల/పట్టణ అధ్యక్షులు, నాయకులతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నియోజకవర్గంలో గ్రామాల్లో ఉన్న అనేక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రధానంగా వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జా, శాంతి భద్రతల సమస్యలు, గ్రామాల్లో కనీస అవసరాలైన త్రాగునీరు, రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ, సమస్యలపై గత కలెక్టర్ కి ఇచ్చిన సమస్యలు, రేణిగుంట పంచాయతీ గ్రామ సభ జరిగిన తీరు, జనసేన నాయకులపై జరిగిన దాడికి సంభందించిన వీడియోలు చూపడం జరిగింది. సమస్యలపై పోరాడితే అక్రమ కేసులు పెడుతున్న విషయాలను, రేణిగుంట బస్టాండ్ లోని అక్రమ షాపులు నిర్మాణం తదితర అంశాలపై చర్చించడం జరిగింది. అక్రమ కట్టడాన్ని వెంటనే తొలగించకపోతే ధర్నా చేస్తామని వినుత తెలిపారు. కలెక్టర్ సమస్యలపై సానుకూలంగా స్పందించి వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, రేణిగుంట మండల అధ్యక్షులు మునికుమార్ రెడ్డి, రేణిగుంట పట్టణ అధ్యక్షులు విజయ ఆనందరావు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.