శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలపై జనసేన పోరాటం

రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ నందు అక్రమంగా నిర్మిస్తున్న షాపులను తొలగించాలని శనివారం తిరుపతి కలెక్టర్ కు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోట అక్రమ కట్టడాలు తొలగించాలని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చినా గానీ అక్కడ నిర్మాణం కొనసాగుతున్నందున జనసేన పార్టీ అఖిలపక్ష పార్టీలతో కలిసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ.. ఉంటే పోలీసులు అక్రమంగా.. రక్తం వచ్చేటట్లు దాడిచేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో డీఎస్పీ దురుసుగా పరుష పదజాలంతో జనసేన నాయకులను దూషించడం జరిగింది. ఈ క్రమంలో డీఎస్పీ జనసేన నాయకులపై రక్తం వచ్చేటట్లు చేసిన దాడికి మరియు పరుష పదజాలంతో దూషించినందుకు రేణిగుంట పోలీస్ స్టేషన్ నందు డిఎస్పీపై ఫిర్యాదు చేయటానికి జనసేన నాయకులు వెళ్లగా.. ఫిర్యాదును పోలీసులు నిరాకరించారు. చివరికి తిరుపతి ఎస్పీతో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ శ్రీమతి వినుత కోట ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదును వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. ఎస్పి దానికి స్పందిస్తూ సోమవారం ఎస్ పి ఆఫీసు నందు వచ్చి కలవమని, దురుసుగా ప్రవర్తించిన డీ ఎస్పీ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన ముగించుకొని వెళ్లడం జరిగింది.