ప్రమాదవశాత్తూ గాయపడిన జనసైనికుడికి ఆర్ధికసాయమందించిన జనసేన
కంసాలిపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు రాపోలు శ్రీను ప్రమాదవశాత్తు కాంక్రీటు మిల్లర్ లో చేయిపడి, చేయికి గాయమయ్యింది, అతనికి నిడదవోలు నియోజకవర్గ జనసేనపార్టీ తరుపున 50000 రూపాయలు ఆర్ధికసాయం అందజేయడం జరిగింది. అనంతరం ఆదివారం పుట్టినరోజు జరుపుకుంటున్న ఉలుసు సౌజన్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రకార్యదర్శి ప్రియాసౌజన్య, జిల్లా సంయుక్త కార్యదర్శులు పాలా వీరస్వామి, తులా చిన్నబాబు, కాకర్ల నాని, ఉలుసు సౌజన్య, జిల్లా వర్కింగ్ కమిటీ యడ్లపల్లి సత్తిబాబు, మూర్తి, పందల పర్రు నాయకులు వినోద్, ఏఎనార్, నిడదవోలు గ్రంధి వెంకట్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-17-at-9.52.04-PM-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-17-at-9.47.05-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-17-at-9.51.23-PM-1024x769.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-17-at-9.51.22-PM-1024x769.jpeg)