పితాని బాలకృష్ణ సమక్షంలో జనసేనలో చేరికలు

ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, బలుసు తిప్ప గ్రామము నుండి మత్స్యకార సోదరులు వైయస్సార్, టిడిపి పార్టీల నుండి సంఘాని ధర్మారావు, ఓలేటి శ్రీను, పెమ్మాడి గంగాద్రి, సంఘాన్ని రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి సోమవారం జనసేన పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ సమక్షంలో వారు పార్టీ లో చేరారు. వారిని జనసేన పార్టీ లోకి కండువాలు కప్పి ఆహ్వానించి.. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ పై నమ్మకంతో పార్టీ లో చేరిన మత్స్యకార సోదరులకు ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని బాలకృష్ణ గారు హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మత్స్యకార గ్రామాల నుండి మరిన్ని చేరికలు ఉంటాయని.. మత్స్యకార సోదరులు హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జున రావు, గుదటి జమ్మి, గోదశి పుండరీ, జక్కం శెట్టి పండు, గొల్ల కోటి వెంకన్న బాబు, గొల్ల కోటి సాయిబాబు, కడలి వెంకటేశ్వరరావు, దూడల స్వామి, జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.